Thursday, July 28, 2016

శ్రీరామపట్టాభిషేకఘట్టము


 శ్రీరామచంద్రాయ నమ:

శ్రీరామపట్టాభిషేకఘట్టము

(యుద్ధకాండము-131వ సర్గము - 59వ శ్లోకముతో ప్రారంభము)

    తత స్ప ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైౖస్సహ,
    రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్‌ 1
    వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యప:,
    కాత్యాయనస్సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా 2
    అభ్యషించన్‌ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా
    సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా 3
    అనంతరము మహర్షులో శ్రేష్ఠుడు, వంశపురోహితుడు ఐన వసిష్ఠ మహాముని ఋత్విజులైన బ్రాహ్మణుతోగూడి సీతాసహితుడైన శ్రీరామచంద్రుని రత్నసింహాసనముపై ఆసీనుని గావించెను. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞాడు, గౌతముడు, విజయుడు మొదగు మహర్షు పురుషోత్తముడైన శ్రీరామచంద్రప్రభువును నిర్మములైన సుగంధజముతో, వసువు దేవేంద్రునివలె అభిషేకించిరి. (1`3)
    ఋత్విగ్భి: బ్రాహ్మణై పూర్వం కన్యాభి మంత్రిభిస్తథా,
    యోధై శ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టా: సనైగమై:4
    సర్వౌషధిరసైర్దివ్యై: దైవతైర్నభసి స్థితై:,
    చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతై: 5
    పిమ్మట ఋత్విజులైన బ్రాహ్మణు, కన్యు, మంత్రు, యోధు, పురప్రముఖు మొదగు వారితోగూడి, వసిష్ఠాదిమహర్షు పరమసంతోషముతో ఆ ప్రభువునకు వేదమంత్రపూర్వకముగా అభిషేకము జరిపిరి. ఇంకను వారు ఆకాశమున నిలిచియున్న దేవతు, గంధర్వు, కిన్నరకింపురుషాదుచేతను, నుగురు దిక్పాురచేతను, అచటికి విచ్చేసిన తదితరదేవతదరి చేతను వివిధములైన ఓషధిరసముతో సీతారామును అభిషిక్తును గావించిరి. (4-5)
    ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్న: పాండురం శుభమ్‌,
    శ్వేతం చ వావ్యజనం సుగ్రీవో వానరేశ్వర:,
    అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణ:6
    శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన త్లెని ఛత్రమును పట్టుకొనెను, వానరరాజైన సుగ్రీవుడు త్లెని వింజామరతో సేవించుచుండెను. రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులీను మటియొక వింజామరతో వీచుచుండెను. (6)

    మాలాం జ్వంతీం వపుషా కాంచనీం శతపుష్కరామ్‌
    రాఘవాయ దదౌ వాయు: వాసవేన ప్రచోదిత: 7
    సర్వరత్నసమాయుక్తం మణిరత్నవిభూషితమ్‌,
    ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్రప్రచోదిత:8
    పిమ్మట దేవేంద్రునిపనుపున వాయుదేవుడు సుందరమైన ఆక అతితో స్వయముగా వచ్చి నూపద్మముతోగూడి మెయుచున్న బంగారుమాను, వివిధముగు రత్నముతో, మణుతో భాస్లిుచున్న ముత్యాహారమును ఆ ప్రభువునకు భక్తితో సమర్పించెను. (7-8)
    ప్రజగుర్దేవగంధర్వా: ననృతుశ్చాప్సరోగణా:
    అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమత: 9
    భూమిస్సస్యవతీదైవ ఫవంతశ్చ పాదపా:
    గంధవంతి చ పుష్పాణీ బభూవూ రాఘవోత్సవే 10
    ప్రజ్ఞాశాలియు, తన శుభక్షణముచే పట్టాభిషేకమునకు అర్హుడును ఐన శ్రీరామచంద్రునియొక్క ఆ మహోత్సవసమయమున దేవతు, గంధర్వు గానము చేసిరి, అప్పరసు నృత్యమును గావించిరి. ఆ శుభసమయమున భూమి పైరుపంటతో కకలాడెను. చెట్లన్నియును పండ్లతో నిండి కనువిందుగావించుచుండెను. పుష్పము సువాసనను వెదజ్లుచుండెను. (9`10)
    సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా
    దదౌ శతం వ అషాన్‌ పూర్వం ద్విజేభ్యో మనుజరభ:11
    త్రింశత్కోటీర్షిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌపున:
    నానాభరణ వస్త్రాణి మహార్హాణి చ రాఘవ: 12
    ఆ పురుషోత్తముడు ముందుగా క్షసంఖ్యలో గుఱ్ఱమును, పాడియావును, గోవును, వందకొది వృషభమును బ్రాహ్మణోత్తముకు దానముచేసెను. ఆ మహాత్ముడు ఇంకను ముప్పదికోట్ల బంగారునాణెమును, అమ్యూములైన వివిధముగు ఆభరణమును, వస్త్రమును ద్విజవరుకు పంచియిచ్చెను. (11-12)
    అర్కరశ్మిప్రతీకాశాం కాంచనీం మణివిగ్రహామ్‌,
    సుగ్రీవాయ ప్రజం దివ్యాం ప్రాయచ్ఛన్మనుజ్షంభ: 13
    వైడూర్యమణిచిత్రే చ వజ్రరత్నవిభూషితే
    వాలిపుత్రాయ ధృతిమాన్‌ అంగదాయాంగదే దదౌ14
    ఆ ప్రభువు సుగ్రీవునకు మణు పొదిగిన ఒక బంగారుహారమును బహూకరించెను. అది సూర్యకిరణమువలె జిగుేమనుచు దివ్యకాంతును విరజిమ్ముచుండెను. ఆ స్థితప్రజ్ఞుడు వజ్రముతో, రత్నముతో, వైడూర్యమణుతో చిత్రవిచిత్రముగా నిర్మితములైన రెండు భుజకీర్తును వాలికుమారుడైన అంగదునకు బహుమతిగా ఇచ్చెను.(13-14)
    మణిప్రవరజష్టంచ ముక్తాహారమనుత్తమమ్‌,
    సీతాjైు ప్రదదౌ రామ: చంద్రరశ్మిసమప్రభమ్‌15
    ఆరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ,
    అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే16
    అవమచ్యాత్మన్ణ కంఠాత్‌ హారం జనకనందినీ,
    అనైక్షత హరీన్‌ సర్వాన్‌ భర్తారం చ ముహుర్ముహు: 17
    తామింగితజ్ఞస్సంప్రేక్ష్య బభాషే జనకాత్మజామ్‌,
    ప్రదేహి సుభగే! హారం యస్య తుష్టాసి భామిని!
    పౌరుషం విక్రమో బుద్ది: యస్మిన్నేతాని సర్వశ: 18
    దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితేక్షణా,
    హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభ:
    చంద్రాంశుచయగౌెరేణ శ్వేతాభ్రేణ యథా2చ:19
    ఇంకను ఆ స్వామి మేలైన మణుతోగూడిన ఒక ముత్యాహారమును హనుమంతునకు బహూకరించుటకై సీతాదేవిచేతికిచ్చెను. ఉత్తమమైన ఆ ఆభరణము చంద్రుని కిరణమువలె మనోరంజకముగానుండెను. పిమ్మట ఆ సీతామాత భర్తవైపు చూచుచు స్వచ్ఛములైౖ దివ్యములైన వస్త్రమును, చక్కని ఆభరణమును మారుతికి కానుకుగా ఇచ్చెను. పిదప ఆ జానకి తనమెడలోని కంఠాభరణమును దీసికొని, తనభర్తను, సమస్త వానరును పదేపదే చూడసాగెను. ఆమె మనస్సులోని భావమును గ్రహించిన శ్రీరాముడు ఆమెతో ‘‘ఓ సుందరీ! సాటిలేని పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదగు క్షణమును పూర్తిగా కలిగి, నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహూకరింపుము.’’ అని పలికెను. అప్పుడు ఆ శుభాంగి ఆ హారమును వాయుసుతునకు ఇచ్చెను. కపివరుడైన ఆ వాయుసూనుడు ఆ హారమును ధరించినంతనే చంద్రకిరణము ప్రసరించినప్పుడు స్వఛ్ఛమైన మేఘముతో గూడియున్న పర్వతమువలె విరాజిల్లెను. (15-19)
    తతో ద్వివిదమైందాభ్యాం నీలాయ చ పరంతప:,
    సర్వాన్‌ కామగుణాన్‌ వీక్ష్య ప్రదదౌ వసుధాధిప: 20
    పర్వవానరవృద్ధాశ్చ యే చాన్యే వానరేశ్వరా:,
    వాపోభిరూÄ్భషణెశ్చైవ యథార్హం ప్రతిపూజితా: 21
    విభీషణో2థ సుగ్రీవో హనుమాన్‌ జాంబవాంస్తథా,
    సర్వవానరముఖ్యాశ్చ రామేణాక్లిష్టకర్మణా 22
    శత్రుసూదనుడైన శ్రీరామచంద్రప్రభువు మైందునకు, ద్వివిదునకు, నీునకు, వారి అభిరుచుకు అనుగుణముగా కోరినవాటినన్నింటిని బహూకరించెను. వృద్ధులైన వానరునందరిని, తదితర కపివరును నూతనవస్త్రముతో, ఆభరణముతో తగిన రీతిగా సత్కరించెను, ఎంతటి కార్యమునైనను సుభముగా నిర్వహింపగ శ్రీరాముడు విభీషణుని, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదగు వానరప్రముఖును వస్త్రాభరణముతో పూజించెను. (20`22)
    యథార్థం పూజితా: సర్వై కామై రత్తైశ్చ పుష్కలై:,
    ప్రహ్పష్టమనసస్సర్వే జగ్మురేవ యథాగతమ్‌ 23
    దృష్ట్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగ్షంభా:,
    విసష్టా: పార్థివేంద్రేణ కిష్కింధామభ్యపాగమన్‌ 24
    తాము కోరుకొనినరీతిగా పుష్కముగా రత్నాభరణాదుచే తగినవిధముగా సత్కరింపబడిన ఆ వానరప్రముఖు ఎ్లరును ప్రసన్నచిత్తులై, తమతమ స్థానముకు వెళ్ళుటకు సిద్ధమైరి. అనంతరము ఆ కపివయి అందరును మహాత్ముడైన శ్రీరామునకు నమస్కరించి, ఆ ప్రభువు అనుమతితో కిష్కింధకు బయుదేరిరి. (23`24)
    సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనమ్‌ 25
    బ్ద్వా కుధనం రాజా ంకాం ప్రాయాద్విభీషణ: 26
    పిమ్మట వానరేంద్రుడైన సుగ్రీవుడు రామపట్టాభిషేకమును చూచి ఆనందించి, కిష్కింధకు చేరెను. పిదప రాక్షసరాజైన విభీషణుడు ఇక్ష్వాకుప్రభువు ఇమ్పేను (శ్రీరంగనాథస్వామి మూర్తిని) గ్రహించి ంకకు బయుదేరెను. (25-26)
    సరాజ్యమఖిం శాసన్‌ నిహతారిర్మహాయశా:
    రాఘవ: పరమోదార: శశాస పరయా, ముదా:27
    ఉవాచ క్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్స:28
    దుష్టును శిక్షించుచు మిగు వాసి గాంచినవాడు, ఉదారస్వభావుడు ఐన రఘువరుడు సమస్త కోసరాజ్యమును పరమసంతోషముతో పరిపాలింపసాగెను. ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడైన క్ష్మణునితో ఇట్లనుడివెను.(27-28)
    ఆతిష్ఠ ధర్మజ్ఞ! మయా సహేమాం
        గాం పూర్వరాజాధ్యుషితాం బలేన
    త్యుం మయూ త్వం పితృభి: ధృతా యా
        తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ 29
    ‘‘ఓ ధర్మజ్ఞా! మనపూర్వు (మన్వాదు) తమ పరాక్రమముతో పరిపాలించిన ఈ సుసంపన్నరాజ్యమును నాతో గూడి పాలింపుము. నీవు నాతో సమానుడవు. మన తండ్రి, తాత ముత్తాతు నిర్వహించిన ఈ రాజ్యమునకు యువరాజువై, దీని భారమును వహింపుము.’’ (29)
    సర్వాత్మనా పర్యనునీయమానో
        యదా న సౌమిత్రిరుపైతి యోగమ్‌
    నియుజ్యమానో2పీచ యావరాజ్యే
        తతో2భ్యషించద్భరతం మహాత్మా 30
    ‘యువరాజపదవిని స్వీకరింపుము’ అనుచు శ్రీరాముడు ఎంతగా నచ్చజెప్పచున్నను క్ష్మణుడు అందుకు ఏమాత్రము ఒప్పకొనలేదు. పిదప ఆ ప్రభువు భరతుని యువరాజునుగా జేసెను. (30)
    పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చా2సకృత
    అన్యైశ్చ వివిధైర్యజ్ఞై అయజత్‌ పార్థివర్షభ:31
    రాజ్యం దశసహస్రాణీ ప్రాప్య వర్షాణి రాఘవ:
    శతాశ్వమేధానాజప్రేరీ సదశ్వాన్‌ భూరిదక్షిణాన్‌ 32
    ఆ రాజశ్రేష్ఠుడు పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము, ఇంకను తదితరములైన యజ్ఞమును తచుగా నిర్వహించుచువచ్చెను. ఆ రఘువరుడు పదివేసంవత్సరముపాటు కోసరాజ్యమును పరిపాలించెను. ఆ ప్రభువు మేుజాతి అశ్వమును, పుష్కముగా దక్షిణను ఒసంగి వందకొది అశ్వమేధయాగమును ఆచరించెను(31-32)
    ఆజానుంబబాహుస్స మహాస్కంధ: ప్రతాపవాన్‌
    క్ష్మణానుచరో రామ: పృథివీమన్వపాయత్‌ 33
    రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమమ్‌
    ఈజే బహువిధైర్యజ్ఞై ససుహృత్‌ జ్ఞాతిబాంధవ: 34
    ఆజానుబాహువు, ప్రతాపశాలియు, గొప్పభుజబము గవాడును ఐన రామచంద్రప్రభువు క్ష్మణుని సహకారముతో భూమండమును పాలించెను. ధర్మాత్ముడైన రఘువరుడు విశామైన కోసరాజ్యమునకు ప్రభువై బంధుమిత్రుతోగూడి బహువిధములైన యజ్ఞమును నిర్వహించెను. (33%ు34)
    న పర్యదేవన్‌ విధవా న చ వ్యాళకృతం భయమ్‌
    న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి 35
    నిర్దస్యురభవల్లోకో నా2నర్థ: కంచిదస్పృశత్‌
    నచస్మ వృద్దా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే 36
    సర్వం ముదితమేవాసీత్‌ సర్వో ధర్మపరో2భవత్‌.
    రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్‌ పరస్పరమ్‌ 37
    శ్రీరాముడు రాజ్యపాన చేయుచుండగా స్త్రీకు వైధవ్యము లేకుండెను. ప్రజకు క్రూరమృగముబాధ లేకుండెను, వారు రోగగ్రస్తు గాకుండిరి, జనుకు దొంగ భయము లేకుండెను, ఎట్టి అనర్ధమును సంభవింపకుండెను. పెద్దు బ్రతికియుండగా వారిప్లిు మృత్యువుపాు కాకుండిరి. రామరాజ్యములో ప్రజల్లెరును ధర్మనిరతులై సంతోషముతో జీవించుచుండిరి. వారు ఆ ప్రభువునే ధ్యానించుచు పరస్పరవిరోధము లేక ఆత్మీయతతో మెగుచుండిరి. (35`37)
    ఆసన్‌ వర్షసహస్రాణి తథా పుత్త్రసహస్రిణ:
    నిరామయూ విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి 38
    రామో రామో రామ ఇతి ప్రజానామభవన్‌ కథా:
    రామభూతం జగదభూత్‌ రామే రాజ్యం ప్రశాసతి 39
    ఆ ప్రభువుయొక్క పరిపానలో ప్రజందరును దీర్షాయువులై (వేకొదిసంవత్సరము జీవించుచు) సంతానసమృద్ధి గలిగియుండిరి. వారు శోకరహితులై ఆరోగ్యభాగ్యముతో వర్ధ్లిుచుండిరి. ఆ రఘువరుని రాజ్యమున ఎవరినోటవిన్నను (ప్రజలో) రామనామము, రామునిగాథలే వినబడుచుండెను, జగమంతయు రామమయమై ఒప్పచుండెను. (38`39)
    నిత్యపుష్పా నిత్యఫలా: తరవ: స్కంధవిస్తృ అతా:
    కాలే వర్షీచ పర్జన్య సుఖస్పర్శశ్చ మారుత: 40
    వృక్షమున్నియును లావైన బోదెతో విస్లిుచుండెను. అవి నిత్యము పుష్పించుచు, ఫలించుచు కనువిందు గావించుచుండెను, సకాములో వాను కురియుచుండెను. వాయువు హాయినిగ్పొుచు వీచుచుండెను. (40)
    బ్రాహ్మణా: క్షత్త్రియా వైశ్యా: శూద్రా లోభవివర్జితా:
    స్వకర్మసు ప్రవర్తంతే తుష్టా స్వైరేవ కర్మభి: 41
    ఆసన్‌ ప్రజాధర్మరతా రామే శాసతి నా2న వృతా:
    సర్వే క్షణసంపన్నా: సర్వే ధర్మపరాయణా: 42
    బ్రాహ్మణు మొదగు అన్నివర్ణమువారును దురాశలేనివారై తమతమకర్మయందే ప్రవర్త్లిుచు సంతుష్ఠులై యుండిరి, రామరాజ్యమునందు ప్రజందరును శుభక్షణముగవారు, ధర్మనిరతు, సత్యమునే పలికెడివారు. స్వధర్మమును ఆచరించుటయందే ఆసక్తిగవారు. (41-42)
    దశవర్షసహస్రాణీ దశవర్షశతాని చ,
    భ్రాతృభిస్సహిత: శ్రీమాన్‌ రామో రాజ్యమకారయత్‌ 43
    శ్రీరామచంద్రప్రభువు తనసోదరుతోగూడి పదకొండువేసంవత్సరము కోసరాజ్యమును పరిపాలించెను. (43)
    ధర్మ్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహమ్‌
    ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతమ్‌44
    య: పఠేచ్ఛణుయాల్లోకే నర: పాపాద్విముచ్యతే
    పుత్రకామస్తు పుత్రాన్‌ వై ధనకామో ధనాని చ 45
    భతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనమ్‌
    మహీం విజయతే రాజా రిపూంశ్చాప్యధితిష్ఠతి 46
    వాల్మీకిమహర్షి రచించిన, ఆదికావ్యమగు ఈ శ్రీమద్రామాయణము శుభప్రదమైనది, ఆయురారోగ్యమును, కీర్తిప్రతిష్టను పెంపొందించునది, ఇది రాజుకు విజయమును చేకూర్చునది. లోకమున ఈ కావ్యమును పఠించినవారు, వినినవారు (శ్రోతు) సమస్తపాపము నుండీయు విముక్తు అగుదురు. ఈ రామాభిషేక ఫుట్టమును వినినవారికి సంతానము కుగును, సంపదు ప్రాప్తించును. రాజు శత్రువును జయించి, ఈ భూమండమున వర్ధ్లిుదురు. (44`46)
    రాఘవేణ యథా మాతా సుమిత్రా క్ష్మణేన చ
    భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రిీయ: 47
    ఈ కావ్యమును వినిన స్త్రీు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌస్యవలెను, క్ష్మణశత్రుఘ్నును గనిన సుమిత్రవలెను, భరతునికారణమున కైకేయివలెను పుత్రుతో కకాము వర్ధ్లిుదురు. (47)
    శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయశ్చ విందతి
    రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణ:48
    శృణోతి య ఇదం కావ్యమ్‌ ఆర్షం వాల్మీకినా కృతమ్‌
    శ్రద్దధానో జితక్రోధో దుర్గాణ్యతితరత్యసౌ49
    సమాగమ్య ప్రవాసాంతే భతే చాపి బాంధవై:
    ప్రార్థితాంశ్చ వరాన్‌ సర్వాన్‌ ప్రాప్నుయాదిహ రాఘవాత్‌ 50
    ఎంతటి కార్యమునైనను అవలీగా సాధించునట్టి శ్రీరాముని విజయమును, ఆ ప్రభువు వృత్తాంతమును
 తెలిపెడి రామాయణ గాథను వినినవారు దీర్షాయువుగుదురు. వాల్మీకిమహర్షి విరచితమైన ఈ మహాకావ్యమును శ్రద్ధగా ఆకించినవారు జితక్రోధులై దారిద్య్రాదిదు:ఖమునుండి విముక్తుగుదురు. దీర్ఘకాము బంధువుకు దూరమైన వారు మర వారిని కలిసికొందురు, శ్రీరాముని అనుగ్రహమున వారి కోరికు అన్నియును నెరవేరును. (48`50)
    శ్రవణేన సురాస్సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతామ్‌
    వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్ఠంతి యస్య వై 51
    విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్‌ ప్రజేత్‌
    స్త్రీయో రజస్వలా శ్రుత్వా పుత్రాన్‌ సూయురనుత్తమాన్‌ 52
    రామాయణశ్రవణముచే దేవతు ప్రసన్నుగుదురు. ఆ శ్రోత యొక్క కుటుంబముకు దుష్టగ్రహబాధు తొగిపోవును. రాజ్యమును కోల్పోయిన భూపతు రామాయణ శ్రవణప్రభావమున శత్రువును జయించి, తిరిగి తమ రాజ్యమును పొందుదురు, వారికి సక శుభము చేకూరును, స్త్రీు గర్భవతులై ఉత్తములైన పుత్రును బడయుదురు. (51-52)
    పూజయంశ్చ పఠంశ్చేమమ్‌ ఇతిహాసం పురాతనమ్‌
    సర్వపాపాత్‌ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్‌ 53
    ప్రాచీనమైన ఈ ఇతిహాసమును భక్తిశ్రద్ధతో పూజించి, పఠించిన వారియొక్క పాపము పటాపంచగును, వారికి దీర్షాయురారోగ్యము ప్రాప్తించును. (53)
    ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రిjైుర్డ్విజాత్‌
    ఐశ్వర్యం పుత్త్రలాభశ్చ భవిష్యతి న సంశయ: 54
    బ్రాహ్మణుకు శిరసా ప్రణమిల్లి, ఆద్విజోత్తమునుండి ఈ వ అత్తాంతమును వినిన క్షత్రియు ఐశ్వర్యమును, పుత్రును పొందుదురు. ఇందు సందియము లేదు.(54)
    రామాయణమిదం క ృత్నం శృణ్వతః పఠతస్పదా,
    ప్రీయతే సతతం రామః సహి విష్ణుస్సనాతనః 55
    శ్రీరాముడు సాక్షాత్తు సనాతనుడైన శ్రీమహావిష్ణువుయొక్క అవతారమే. కనుక రామాయణమును సంపూర్ణముగా వినిన వారికిని, పఠించిన వారికిని రామానుగ్రహము సిద్ధించును.55
    ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణ: ప్రభు:
    సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో క్ష్మణ ఉచ్యతే 56
    రఘువంశశిరోమణి, మహాబాహువు ఐన శ్రీరామచంద్ర ప్రభువు దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడే. క్ష్మణస్వామి ఆదిశేషుని అవతారము, (56)
    కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం
        స్త్రియశ్చ ముఖ్యా స్సుఖముత్తమం చ
    శ్రుత్వా శుభం కావ్య మిదం మహార్థం
        ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిమ్‌ 57
    ఈ రామాయణమహాకావ్యము సర్వశుభకరము. సమస్తప్రయోజనమును చేకూర్చును. దీని శ్రవణమువన కుటుంబవృద్దియు, ధనధాన్యసమృద్దియు కుగును. ముఖ్యముగా స్త్రీకు ఉత్తమమైన సుఖము ప్రాప్తించును. (57)
    ఆయుష్య మారోగ్యకరం యశస్యం
        సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ
    శ్రోతవ్య మేతన్నియమేన సద్బిః
        ఆఖ్యానమోజస్కరమృద్దికామైః 58
    ఈ ఇతిహాసము ఆయురోగ్యమును, కీర్తి ప్రతిష్ఠను సౌభ్రాతృత్వమును, బుద్ధికౌశమును సుఖశాంతును తేజోవైభవమును ప్రసాదించును. కావున సమస్తసంపదను అభిషించెడి సత్పురుషు నియమనిష్టతో దీనిని శ్రవణము చేయవలెను. (58)
    ఏవమేతత్‌ పురావృత్తమ్‌ ఆఖ్యానం భద్రమస్తు వః
    ప్రవ్యాహరత విప్రజ్ఞం బం విష్ణోః ప్రవర్ధతామ్‌ 59
    దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాద్దహణాత్‌ తథా
    రామాయణస్య శ్రవణాత్‌ తుష్యంతి పితరస్తథా 60
    భక్త్యా రామస్య యే చేమాం సంహితామ్‌ ఋషిణా కృతామ్‌
    లేఖయంతీహ చ నరా: తేషాం వాసః త్రివిష్టపే 61
    ప్రాచీనమైన ఈ రామోదంతము మీకు సర్వశుభమును చేకూర్చుగాక. మీపై శ్రీమన్నారాయణుని ప్రభావము మిక్కిలి ప్రసరించుగాక! ఈ రామాయణమును తమకడ కలిగియుండి ఇందలి దివ్య గాథను వినినచో దేవతును, పిత ృదేవతును త ృప్తిపడుదురు, వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంహితను భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గసుఖమును పొందుదురు. (59-60
    ఇది వాల్మీకిమహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి యుద్ధకాండమునందు ‘శ్రీరామపట్టాభిషేకము’ అనెడి నూటముప్పదిఒకటవసర్గము.
    కాయేన వాచా మనసేంద్రిjైుర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్‌
    కరోమి యద్యత్‌ సకం పరస్మై నారాయణాయేతి సమర్పయామి
    యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత
    తత్పర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమో2స్తుతే
    ఆత్మా త్వం క్షితిజా మతి: సహచరా: ప్రాణా: శరీరం గృహమ్‌
    పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః
    సంచారః పదయో: ప్రదక్షిణవిధి: స్తోత్రాణి సర్వా గిరో
    యద్యత్‌ కర్మ కరోమి తత్తదఖిం రామా2స్తు తే పూజనమ్‌


కృష్ణా పుష్కరాల సమయంలో

కృష్ణా పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించడానికి నదిలో దిగినప్పుడు కృష్ణవేణిని, వినాయకుణ్ణి సూర్యభగవానుణ్ణి, బ్రహ్మసరస్వతులను, లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, పుష్కరుడిని, బృహస్పతిని, ఇంద్రుడ్ని సప్తరుషులను, పంచభూతాలను, మీరు స్నానం చేస్తున్న క్షేత్రదైవాన్ని మీ ఇంటి ఇలవేల్పును, మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా స్మరించి, అర్థ్యాలను సమర్పించి, కృష్ణానదికి పసుపుకుంకుమలు అర్పించాలి. దీపనీరాజనాలు సమర్పించాలి. సంకల్పపూర్వకంగా పుణ్యస్నానం ఆచరించాలి. కృష్ణా పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించడం అంటే భక్తిశ్రద్ధలతో సకలపాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ మూడు మునకలు వేయడం. భార్యభర్తలైతే వేణీస్నానం చేయాలి. అంటే భార్య కొంగును భర్త కండువాకు కట్టుకుని ఇద్దరూ ఒకేసారి మునకలు వేయాలి. భార్యాభర్తలు ఒకేసారి పుష్కరస్నానాలకు వెళ్లలేకపోయిన పక్షంలో స్త్రీలు మంగళసూత్రంపై పురుషులు హృదయంపై చేయి పెట్టుకుని స్నానం చేయాలి. ఇప్పుడు భార్యభర్తలు ఒకేసారి పుణ్యస్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సూతకం ఉన్నవారు సైతం పుష్కరస్నానం చేయవచ్చు. పుష్కరస్నానం తర్వాత కృష్ణానదీమతల్లిని అష్ణోత్తర శతనామాలతో అర్చించాలి. వీలైతే బ్రాహ్మణుడి చేత పూజాక్రతువు నిర్వహించుకోవచ్చు. మీ శక్త్యానుసారం దానాదికాలు చేయాలి. పితృదేవతలకు పిండప్రదానం చేసినటైతే పుణ్యస్నానం చేయాలి. నదీ తీరాన ఉన్న క్షేత్రదర్శనం చేయాలి. పుష్కరాలకు రాలేకపోయిన బంధుమిత్రుల కోసం నదీజలాన్ని ఇంటికి
తీసుకెళ్లాలి.

ఓం శ్రీకృష్ణాయై నమః
రాబ్దాయై మత్సింహాసనేశ్వర్యై
శ్రీచక్రరాజనిలయార్డయై
శ్రీకరాయై
శ్రీపతివ్రతాయై శ్రీనదీమాతృకాయై
శ్రీమదనంతఫలదాయిన్యై
శ్రీబీజాయై శ్రీకరావరాయై శ్రీజయాయై శ్రీవిరాజితాయై శ్రీమూలాయై శ్రీమత్యై శ్రీమదాపగాయై శ్రీమదాంబికాయై శ్రీగుణాయై శ్రీనద్యై శ్రీమదలకాయై
శ్రీకుచద్వయాయై శ్రీదంతాయై శ్రీకచాయై శ్రీమద్భూమధ్యాయై శ్రీవసుంధరాయై శ్రీతోయాయై శ్రీముఖాయై శ్రీనికేతనాయై శ్రీవిలాసిన్యై శ్రీభ్రూయుగార్డయై
శ్రీమదంబాయై
శ్రీసింహాసనసంస్థితాయై శ్రీజంఘార్డయై
శ్రీభగాయై శ్రీమత్కిలిచక్రవిరాజితాయై శ్రీమధ్యాయై శ్రీమహావాసాయై శ్రీదృశ్యాయై శ్రీమనోరథాయై
శ్రీశ్రీమ్యై శ్రీమహాదీప్తాయై
శ్రీబలాయై శ్రీమహామతాయై
పుష్కర స్నానం ఆచరించేటప్పుడు నదిలో పసుపు కుంకుమలు, పుష్పాలు అర్పిస్తూ ఈ అష్ణోత్తర శతనామావళిని పఠించాలి. ప్రతి నామానికి ముందు "ఓం" అని, చివర “నమః" అని కలిపి చదువుకోవాలి.
శ్రీభూషణాయై శ్రీభూనీలాదిసంస్తుతాయై
శ్రీజటాయై శ్రీఖేచర్యై
శ్రీస్మితాననాయై శ్రీపురాణ్యె
శ్రీమగమదాసంవేద్యాయై శ్రీమద్భూషణభూషితాయై
శ్రీవేదాంతప్రదీప్తికాయై శ్రీమత్పండితసంపూజ్యాయై
శ్రీచంద్రశేఖరజటాజూటాంతరనివాసిన్యై శ్రీదివ్యామృతవాహిన్యై
శ్రీభద్రాసనమథస్థాయై శ్రీమన్మునిసతీబృందసేవితామలపాదుకాయై
శ్రీవీణాగానలోలుపాయై శ్రీమత్సురీబృందసత్కుచాలింగితతరంగిణ్యె
శ్రీమచ్చిత్రాంబరధరామై శ్రీమన్లో హత్యాపాపౌఘహారిణ్యె
శ్రీమత్కంచుకధారిణ్యె శ్రీమహానద్యై
శ్రీమంత్రరాజఫలదాయై శ్రీమాతృసంగపాపఫై్యు
శ్రీమద్దిరివరాత్మజాయై శ్రీహత్యాఘనివారిణ్యె శ్రీమదద్భుతచారిత్రాయై శ్రీశైలోత్తుంగసంయోగసమాగతమహానద్యై
శ్రీవత్సాంకితవక్షస్యై శ్రీనారదాదిమానిభిస్సంపూజితపదాంబుజాయై
శ్రీమత్కాంచనపుష్పాభ నాసికాయై శ్రీశ్రీమత్కృష్ణానదీపుణ్యాహ్వయదివ్యమహానద్యై నమః
శ్రీమనోహరాయై
శ్రీవిగ్రహాయై
శ్రీవిశేషార్డయై
శ్రీభాషాయై
శ్రీధరాత్మజాయై
శ్రీనారాయణపాదాబ్దమందారాయై
శ్రీకరార్చితాయై
శ్రీమార్కండాఘసంహార్యై

కృష్ణానది పుష్కరాల సమయ0ల చేయాల్సిన దానాలు
పుష్కరాల సమయంలో శక్త్యానుసారం ఏ చిన్నదానం చేసినా అది కోటిజన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రవచనం. అందుకే వాల పాల శక్తిని అనుసరించి కృష్ణానదీ తీరాన పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆయా రోజుల్లో పేర్కొన్న దానాలు చేయవచ్చు.
2O16, ఆగస్టు 12 శుక్రవారం బంగారం, ధాన్యం, భూమి, అన్నదానం
2O16-ఆగసు 13 శనివారం రత్నాలు, గోవు. ఉప వస్తాలు Go 2016, ఆగస్టు 14 ఆదివారం బెల్లం, పళ్లు, ఆకుకూరలు, వెండిగుర్రంప్రతిమ
2016, ఆగస్టు 15 సోమవారం నెయ్యి నువ్వులనూనె, పాలు, తేనె, చక్కెర
2016, ఆగస్టు 16 మంగళవారం ధాన్యం, ఎద్దు  2O16, ಅಗಸ್ಟು 17. బుధవారం గంధపుచెక్క ఔషధాలు, కర్పూరం, కసూరి
2016, ఆగస్టు 18 గురువారం పీట, మంచం, వాహనం, గృహం 2016, ఆగస్టు 19 శుక్రవారం గంధం, కందమూలాలు, పూలు 2016, ఆగస్టు 20 శనివారం 16 రకాల దానాలు, పిండప్రదానాలు 2016, ఆగస్ట2 ఆదివారం పూలమాల, ముత్యాలహారం, వెండి 2016, ఆగస్టు 22 సోమవారం పుస్తకాలు, యజ్ఞోపవీతాలు, తాంబూలం
2O16, ఆగస్టు 23 మంగళవారం నువ్వులు, 16 రకాల దానాలు
షోడశదానాలు (16 రకాల దానాలు): 1.ఇల్లు 2. భూమి 3. విసనకర్ర 4. త్రాసు 5. బంగారం 6.వెండి 7. పత్తి 8. తేనె, 9.మంచం 10.రత్నాలు 11.పుస్తకం 12. గోవు 13. ఏనుగు 14. గుర్రం, 15. మేక 16. కన్యాదానం (గోవు, ఏనుగు, అశ్వం వంటివి దానం చేయడం అంటే.. వాటిని ప్రతిమల రూపంలో దానం చేయడమన్నమాట)
కృష్ణానది పుష్కరాల సమయ0ల చేయాల్చిన పిండప్రదానాలు
పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించి, పితృదేవతలకు పిండప్రదానం చేస్తే ఆ వంశంలో గతించినవారికి సద్గతి కలుగుతుందని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణవచనం. అందుకే పుష్కరాల్లో పితృదేవతలకు పిండప్రదానం తప్పక ఆచరించాలి. గతించిన వారి బంధుత్వాన్ని అనుసరించి పిండప్రదానం చేయాలి. బ్రాహ్మణ పురోహితుల ఆధ్వర్యంలో శాస్తోక్తంగా పిండప్రదానం చేస్తే పితృదేవతలందరికీ సద్గతి లభిస్తుంది. కింద పేర్కొన్న బంధుత్వాల్లో ఎవరు మరణించి ఉన్నా వారందరికీ పిండప్రదానం చేయడం శాస్త్రప్రమాణం. అయితే.. తండ్రి మరణించివారు మాత్రమే పుష్కరాల సమయంలో పిండప్రదానం చేసేందుకు అర్చులనే విషయం మర్చిపోకూడదు. కృష్ణానది పుష్కరాల్లో తొమ్మిదో రోజు 2016, ఆగస్టు 20. ఆరోజున వీలుకాకపోతే, గతించిన వారి తిథిని అనుసరించి కానీ లేదా పుష్కర స్నానానికి వెళ్లినరోజున కానీ పిండప్రదానం చేయవచ్చు.
గఠించినవారికి పిండుదానాలు
1. తండ్రి 13. పెద్దనాన్నచిన్నాన్న 2. తల్లి/సవతితల్లి 14. పెద్దమ్మచిన్నమ్మ 3. ముత్తాత(తాత తండ్రి) 15. మేనమామ/మేనత్త 4. జేజమ్ముతాత తల్లి) 16. మేనల్లుడు/మేనకోడలు 5. తాత (తండ్రికి తండ్రి) 17. అల్లుడు/కోడలు 6. తాత (తల్లికి తండ్రి) 18. బావ / మరిది (అక్క/ 7. అమ్మమ్మ చెల్లెలి భర్త) 8. నాయనమ్మ 19. మామ/అత్త 9. భార్య 20. ప్రభువులు/ 10. కొడుకు/కూతురు - యుజమానులు/ దాతలు 11. అన్నతమ్ముడు 21. గురువులు 12. అక్కచెల్లెలు

శ్రీ బాలగణపతి ధ్యానము


కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |
బాలసూర్య మిమం వందే దేవం బాలగణాధిపమ్ ||
దేవాలయాలలో మనం పూజించే విగ్రహాల తీరు భక్తులను ఆకర్షించి వారిహృదయాలలో స్థిరంగా ఉండే విధంగా మలుచబడ్డాయి. కొన్నిచోట్ల స్వయంభువుగా భగవంతుడుఅవతరించాడు. మానవుడు తన జీవితకాలంలో ఎన్నో కష్ట-సుఖాలు అనుభవిస్తుంటాడు తను కష్టంలోవున్నప్పుడు భగవంతుడు రక్షిస్తాడని ప్రగాఢంగావిశ్వసిస్తాడు. పామరులైన వారికి ముక్తిమార్గాన్నిమనప్రాచీన మహర్షులు, ఋషులు శిల్పాగమ గ్రంధాలద్వార మనకందించారు.
మత్స్యపురాణమున పదినెనిమిది మంది శిల్పశాస్త్ర ప్రవర్తల పేర్లు చెప్పారు.1.భృగు 2.అత్రి 3.వసిష్ట 4.విశ్వకర్మ 5.మయ 6.నారద 7.నగ్నజిత్తు 8.విశాలాక్ష 9.పురందర 10.బ్రహ్మ11.కుమార 12.నందీశ 13.శౌనక 14.గర్గ 15.వాసుదేవ 16.అనిరుద్ధ17.శుక్ర 18.బృహస్పతి.
అగ్నిపురాణంలో ఇరవైఐదు, గార్గేయాగమము నందు ఇరవై ఒక్క,మానసారంలో ముప్పైరెండు శిల్పశాస్త్ర ప్రవర్తలు పేర్లు చెప్పారు. వీరుముఖ్యంగా దేవాలయాల ద్వారమానసిక వికాసానికి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నాందిపలికారు. దేవాలయ నిర్మాణంలోశిల్పకళను జోడించి ఆలయాన్నిదర్శించిన వారి హృదయాలు ద్రవింపజేసి సన్మార్గం వైపుకు మల్లించిముక్తిపొందు మార్గాన్నిమన పూర్వికులు అందించారు.
గర్భగృహంలో స్థాపించే బింబాలను ధ్రువబేరమని, ధ్రువార్చ అని అంటారు.ధ్రువబేరాన్ని బహుబేరమని - ధ్రువార్చ ఏకబేరమని అంటారు. వీటితోపాటు కౌతుకబేరము,ఉత్సవబేరము, స్నపనబేరము, బలిబేరము లని ఉత్సవాదులకు ఉపయొగించే విగ్రహాలుంటాయి.
విగ్రహాలలో సాత్విక, రాజస, తామస ప్రతిమలుంటాయి. అదేవిధంగాపంచకృత్యములతో అలరిస్తూ భక్తులను ముక్తిమార్గం వైపు మళ్లిస్తున్నాయి. గర్భగృహంలో పదవిన్యాసంఏర్పచడం ద్వార బ్రహ్మపదం, దైవికపదం, మానుషపదం, పైశాచిక పదాలను లెక్కించి విగ్రహాలనుప్రతిష్ఠించడం జరుగుతుంది.
పదవిన్యాసం ద్వార :- ఒకటవ పదంలో గణములు, రెండవపదంలో చాముండేశ్వరి,మూడపదంలోభైరవప్రతిమలు, నాల్గవ పదంలో వినాయకుడు, ఐదవ పదంలో సూర్యుని, ఆరవ పదంలో సరస్వతీదేవి,ఏడవపదంలో సుబ్రహ్మణ్యుడు, ఎనివపదంలో విష్ణుమూర్తిని, తొమ్మిదవ పదంలో బ్రహ్మ, బ్రహ్మసూత్రం-సోమసూత్రం ఖండిత బిందువు నందు నిష్కళ మైన శివలింగాన్ని స్థాపిస్తారు.
1.ప్రతిమలు – బింబభేదములు
(మయమతం)
నిష్కల - సకలం – మిశ్రం
నిష్కలం సకలం మిశ్రం లింగం చేతి త్రిధా మతమ్ ||
నిష్కలం లింగమిత్యుక్తం సకలం బేరముచ్యతే |
ముఖలింగం తయోమిశ్రం లింగార్చకృతిసన్నిభౌ: ||
2. బింబములు మూడు విధములు:
(శిల్పరత్నం)
నిష్కల - సకలం –మిశ్రం
 అచలం - చలం - చలాచలం
చిత్రం - అర్ధచిత్రం – చిత్రాబాసం
శిలలయందు - అచల బింబములు
రత్నము, దారు, లోహం - చలబింబములు
ధాతు వర్ణములతో - పటాదులు చలాచల బింబములు
భగవద్దర్శనము :- సృష్టికి మూలమైన భగవంతున్ని దర్శించే స్థితులు.
అరూపం - రూపం - రూపారూపం లేక అవ్యక్తం – వ్యక్తం - వ్యక్తావ్యక్తం.

శివ రూపదర్శనం
అధారం: కారణాగమము
అతఃపరం ప్రవక్ష్యామి ప్రతిమాలక్షణం శృణు I
త్రివిధం వ్యక్తమవ్యక్తం వ్యక్తావ్యక్తం త ధైవచ II
వ్యక్తంతుసకలాకారం అవ్యక్తం లింగముచ్యతే I
ముఖలింగమితి ప్రోక్తం వ్యక్తావ్యక్తం ప్రజాయతే II
అవ్యక్తం - శివలింగం, వ్యక్తం - చంద్రశేఖరమూర్తి, వ్యక్తావ్యక్తం - ముఖలింగములుఉదాహరణగా చెప్పవచ్చును.        
అవ్యక్తం                  వ్యక్తం                  వ్యక్తావ్యక్తం
వైష్ణవంలో పాంచరాత్రాగమం ప్రకారం ఐదు రూపాల్లో
పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా వీటిలో అర్చారూపాన్ని శిల్పాచార్యులు శిల్ప శాస్త్రోక్తంగాతయారు చేసినది ఆలయాల్లో ప్రతిష్ఠించి అర్చించునది.
3. ద్రవ్యభేదము - బింబములు – తత్ఫలితములు
శిలామయం మణిమయం లోహం దారుమయం తథా |
మృణ్మయం మిశ్రకం లేఖ్యం బింబం సప్తవిధం స్మృతమ్ ||
4. ప్రతిమా మానలక్షణం:
(మరీచిప్రోక్త - సమరాంగణ సూత్రధారం)
మానాంగులం - మాత్రాంగులం – దేహలబ్దాంగులం
అథ విమానాదిమానవిభాగార్థమంగు లీనాం విధి వక్ష్యే |
మానాంగులం మాత్రాంగులం దేహలబ్ధాంగుల మితిత్రివిధం భవతి |
5. తాలమానం తాల - నియమం:
త్రిమూర్త్యాది  దేవి దేవతలు
ఆసనములు
పద్మాసనం,కుక్కుటాసనం,వీరాసనం,యోగాసనం,ఆలీఢాసనం,ప్రత్యాలీఢాసనం,కూర్మాసనం,సింహాసనం.
6. ప్రతిమల్లోపంచకృత్యాలు:- స్థానక, ఆసన, శయన, స్థానాసన, శయనాసనములు.
1. స్థానకములు :- సమపాదస్థానకము, వైతస్థికస్థానకము, అర్ధవైతస్థికస్థానకము, కాయోత్సర్గము.
2. ఆసనములు :- సుఖ, పద్మ, అర్ధపద్మ, లలిత, వీర, రాజలింగ, ఉత్కుటిక, యోగ, స్వస్తిక, గరుడ.
3. శయనము :- యోగశయనము, సృష్టిశయనము, భోగశయనము, సంహారశయనము.
4. స్థానాసనములు :- వైశాఖ, వైష్ణవము, స్వస్తికము, ఆలీఢము, ప్రత్యాలీఢము, ఏకపాద.
5. శయనాసనము  :- సమశయనము, అర్ధశయనము.
7. శిల్పంలో అంగాలు – అభినయం
దశాంగాలు : తల, ముఖం, కంఠం, వక్షస్థలం, కుక్షి, కటి, మోకాలు, కాలు, పాదము. వీటిలో
మహాంగాలు : ముఖము, చాతి, కటి
అంగాలు : చేతులు, కాళ్లు
ఉపాంగాలు:- శిఖ, నఖ, దంతాలు
ప్రత్యంగాలు : ఆయుధాలు, వస్త్రాలు, ఆభరణలు
ఆంగికాభినయం  : చేతిఅమరికలు, శరీరపుభంగిమలు, ఆసనవిన్యాసం.
ఆహార్యాభినయం : ప్రతిమలకు చెప్పబడిన వస్త్రాలు, ఆభరణాలు, శిరోలంకారములు, ఆయుధములు
సాత్వికాభినయం : కనుబొమలు, కన్ను, పెదవి వీటిద్వార భావాన్ని వ్యక్తీకరించడం
హస్తాభినయం

Tuesday, July 26, 2016

మహా భారతం మనకి ఏమి చెబుతోంది?

మహా భారతం మనకి ఏమి చెబుతోంది?

కర్ణుడు అంటే మంచితనానికి, దాన, ధర్మాలకి పెట్టింది పేరు, అయితే అతను సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన కౌరవుల వైపు నిలబడి అనవసరంగా తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. అందుకే   జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలని మనం తెలుసుకోవాలి.  
శకుని అనే వాడు పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి ఘోర పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి వారు మన జీవితంలో చాలా  రకాలుగా సలహాలని ఇస్తుంటారు. వారిని దూరం పెట్టాలి.
పాండవులు శ్రీ కృష్ణుడుని  అలాగే కౌరవులు కర్ణుడుని పొందటం అనేది  వారికి యుద్ధ సమయంలో ఎంతగా ఉపయోగపడిందో అందరికి తెలిసినదే! కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్య బలమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారని తెలియజేస్తూంది .
కౌరవుల తల్లి గాంధారికి నూరు మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ ఎంతో కష్టమైన పనిష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులంతా  సర్వనాశనం అయ్యారు. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు ఎంత గానో ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం పనికొచ్చే కొన్ని పనులను  నేర్చుకోవాలి.
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న ప్పటికీ పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని నిజాయితీగా చిత్తశుద్దితో పోరాటం చేసి చివరకు విజేతలుగా నిలిచారు.
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదుకదా!  ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం చూపితే అది చివరికి వినాశనానికి, మోసానికి దారితీస్తాయి.



అర్జునుడు తన జీవితమంతా విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం, ఇంద్రుడు ద్వారా దైవ సంబందమైన ఆయుధాల వాడకం, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు  మరియు కృష్ణుడి లాంటి వారి నుండి రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడం వల్ల అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం లభించింది. జీవితంలో అనునిత్యం నేర్చుకోవడం వలన మనం ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.
ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ, అత్యంత బలవంతులు అయినప్పటికి కూడా వారు  సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు మరి!దా.
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. దీని వాళ్ళ మనకు తెలిసిన దేమంటే .... ఏ పని నయినా  పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.
కేవలం ఉత్త పున్యానికి ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది కదా !
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలుకాడు. కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే ఏదీ సాధించలేము.
పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి వ్యూహ మంటూ ఒకటి ఉండాలి. అలా అయితేనే ఆ పనిని సక్రమంగా, సజావుగా పూర్తి చేయగలుగుతాం.